ఆధునిక పద్ధతెల్లో మన భాషలను కాపాడుకోవాలి:రాష్ట్రపతి

తిరువనంతపురం: భారతీయ భాషలను, వాటి సాంస్కృతిక గొప్పతనాన్ని భద్రంగా భావితరాలకు అందించేందుకు ఆధునిక పద్ధతులను వినియోగించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ‘అద్వితీయమైన మన భాషలను పరిరక్షించటానికి ప్రస్తుతం అందుబాటులోఉన్న అన్ని ఆధునిక పద్ధతులను వినియోగించాల్సిన అవసరం ఎంతైన ఉందని మంగళవారమిక్కడ కేరళ విశ్వవిద్యాలయంలో ‘విశ్వ మలయాళ మహోత్సవ్‌-2012ను ప్రారంభించిన అనంతరం ఆయన పేర్కొన్నారు.