ఆధ్యాత్మిక శోభ ఫరుడవిల్లుతుంది

 

వినాయకుని మంటపాలను సందర్శించిన బండి

దేశంలో ఆధ్యాత్మిక శోభ ఫరుడవిల్లుతుందని
బిజేపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని గురు, శుక్రవారాల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి మండలంలో వినాయక మంటపాలను సందర్శించారు. రూరల్ మండలంలోని నగునూర్, ఎలబోతారం, జూబ్లీనగర్, బహుదూర్ఖాన్ పేట్, చామనపల్లి గ్రామాల్లో కొత్తపల్లి మండలంలోని కొండాపూర్, బద్దిపెల్లి, మల్కాపూర్, నాగుల మల్యాల, ఖాజీపూర్, ఎలగందల్ గ్రామలలో కొలువైన గణనాధులను దర్శించికున్నారు.
ఆయా ప్రాంతాల్లోని నిర్వాహకులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ని సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండాలని గణనాధుడిని వేడుకున్నట్లు తెలిపారు.