ఆన్సర్ షీట్లను అమ్మేసిన ఆటో డ్రైవర్

బీహార్(జ‌నం సాక్షి): విద్యా వ్యవస్థలో ఏవైనా లొసుగులు బయటపడాలంటే అవి బీహార్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. బోర్డు పరీక్షల్లో ఎన్నో అక్రమాలు, అవకతవకలు ఇదివరకు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా.. గోపాల్‌గంజ్‌లో ఉన్న ఎస్‌ఎస్ ఇంటర్ కాలేజీకి చెందిన 42,500 పదో తరగతి ఆన్సర్ షీట్లను 8,500 రూపాయలకు కక్కుర్తి పడి అమ్మేశాడు ఓ వ్యక్తి. బీహార్ బోర్డ్ నిర్వహించిన పరీక్ష‌ల సమాధాన పత్రాలు అవి. ఆన్సర్ షీట్లను ఆటోలో తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ సంజయ్ కుమార్ వాటిని పాత సామాను కొట్టులో రూ.8500కు అమ్మేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఆటో డ్రైవర్, పాత సామాను కొట్టు యజమానిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.