ఆపదలో ఆదుకున్న స్వామికి కృతజ్ఞతలు.

బెల్లంపల్లి, నవంబర్ 13, (జనంసాక్షి )
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనను కాపాడిన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకునికి ఆదివారం దూల నవీన్ కృతజ్ఞతలు తెలిపాడు. బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం కతేర్ల గ్రామానికి చెందిన దూల నవీన్ తొందరపాటులో గడ్డి మందు త్రాగి ప్రాణాపాయ స్థితిలో వున్నాడు అని తాజ్ బాబా సేవా సమితి అధ్యక్షులు ఉస్మాన్ పాషా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు నాతరీ స్వామికి అతని పరిస్థితి వివరించగా వెంటనే స్పందించి హెల్త్ కేర్ హాస్పిటల్ కి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయకారాలు అందించడం వల్ల నవీన్ పూర్తిగా కోలుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండగా సహాయ సహకారాలు అందించిన నాతరీ స్వామికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆవేశంలో చేసిన తప్పు వల్ల ప్రాణాపాయ స్థితిలో నా కుటుంబం భయపడుతున్న సందర్బంలో మీరు చేసిన సహాయం వాళ్ళ ఈరోజు బ్రతికి వున్నాను అని తెలుపుతూ నా మనస్ఫూర్తిగా తాజ్ బాబా సేవా సమితి అధ్యక్షుడు ముహమ్మద్ ఉస్మాన్ పాషా, బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు నాతరీ స్వామి రుణపడి వుంటానన్నాడు. ఈ కార్యక్రమంలో నవీన్ కుటుంబ సభ్యులు రమేష్, కృష్ణ పాల్గొన్నారు.