ఆయా విభాగాలలో ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రసంశ పత్రం, క్యాష్ రివార్డు అందజేత

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 26 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖలో ఆయా పోలీస్ స్టేషన్ లలో సిబ్బంది, పోలీస్ అధికారుల పని తీరును మెరుగుపరిచేందుకు అమలవుతున్న 13 వర్టికల్ విభాగాలలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ ప్రసంశ పత్రాలు, క్యాష్ రివార్డు లు సోమవారము అందజెసి అభినందించారు. బాధ్యత తో పని చేసే సిబ్బందికి పోలీస్ శాఖలో తగిన గుర్తింపు ఉంటుందని, వారు మరింత ఉత్సాహం తో పని చేసేందుకు రివార్డ్స్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. ఎస్ హెచ్ ఓ విభాగంలో గట్టు ఎస్సై పవన్ కుమార్,ఇన్వెస్టిగేషన్ వర్టికల్ విభాగంలో గద్వాల పట్టణ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి, ట్రాఫిక్ విభాగంలో అలంపూర్ ఎస్సై శ్రీ హరి, స్టేషన్ రైటర్ విభాగంలో గద్వాల రూరల్ హెచ్ సి నరసింహ గుప్తా , స్టేషన్ ఇంచార్జి విభాగంలో ఐజ హెచ్ సి జయన్న, పెట్రో కార్ విభాగంలో యుగేందర్, కోర్టు డ్యూటీ విభాగంలో మాబాష, టెక్ టీం విభాగంలో రమేష్ బాబు, 5ఎస్ విభాగంలో ఆకాష్, సమ్మన్స్ విభాగంలో తిప్పన్న, వార్రెంట్స్ విభాగం లో రాం దాస్ లు ప్రసంశ పత్రాలను అందుకున్నారు. జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల రిసెప్షన్ అధికారులకు క్యాష్ రివార్డు అందజేశారు. క్యాష్ రివార్డు అందుకున్న రిసెప్షన్ అధికారులు శ్రావణి, నాగలక్ష్మి, కావేరి, విజయ కుమారి, కరుణాకర్, జ్యోతి, చాముండేశ్వరి,నీలమ్మ ,జ్యోతి, మానస,మంజుల,శైలజ,వీణ దేవి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సతీష్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్,ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.