ఆరోగ్య ప్రదాయిని సిఎమ్ఆర్ ఎఫ్

ట్టణములోని క్యాంప్ కార్యాలయంలో శనివారం 31 మంది లబ్దిదారులకు రు. 8 లక్షల 87 వెయిల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు  అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఎరుగని అభివృద్ధిని మన ప్రభుత్వ హయాంలో బోథ్ నియోజకవర్గములో చూస్తున్నామని,అభివృద్ధి విషయంలో గతంలో ఏ నాయకులు పట్టించుకున్న పాపాన పోనీ పరిస్థితి నుండి అబివృద్ది పథములో చిరు నవ్వులు చిందించే స్థాయికి వచ్చామని అన్నారు. అట్టడుగు వర్గాలకు ఆరోగ్య ప్రదాయిని సి ఎమ్ ఆర్ ఎఫ్ అని  అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్,మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్,జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ తాహెర్ బిన్,బోథ్ వైస్ ఎంపీపీ లింబాజి, నెరడిగొండ ఎంపీపీ సజన్ రాథోడ్,ఎంపీటీసీ నారాయణ్ రెడ్డి,చట్ల ఉమేష్,సత్యనారాయణ,రాయల్,మెడిచేల్మా ప్రవీణ్,రమేష్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.