ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

డోర్నకల్, అక్టోబర్-17,జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గా దేవి ఉత్సవాలు భాగంగా నిర్వాహకులు భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి విశేష పూజలు అందిస్తున్నారు. మంగళవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు. అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిక్క రాంబాబు, తల్లాడ వెంకటేశ్వర్లు, వి రంగారావు, కార్లపాటి కృష్ణమూర్తి, కార్లపాటి రాజు, కేతేపల్లి హరినాథ్, చిక్క మురళీకృష్ణ, పాల్వాయి శ్రీనివాసరావు, పాల్వాయి మాధవరావు, కేతేపల్లి కాంతారావు, మహేందర్ కుమార్ జైన్, వార్డ్ కౌన్సిలర్లు సురేందర్ కుమార్ జైన్, పోటు జనార్ధన్,దాతలు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.