*ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్

గద్వాల్
*75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల
సందర్భంగా
*మేరా భారత్ మహాన్ అంటూ ముస్లిం మత పెద్దలు, యువకులు

గద్వాల ఆర్ సి, (జనంసాక్షి) ఆగస్ట్ 14,
జోగులాంబ గద్వాల జిల్లాలోని మన భారతదేశం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు 75వ స్వాతంత్రం భారత వజ్రోత్సవాలు ను ఆల్ ఇండియన్ కౌన్సిల్ గద్వాల అధ్యక్షులు మౌలానా మొహమ్మద్ అబ్దుల్ హాకీమ్ ఫహీం రశాది ఖాస్మి , ఉపాధ్యక్షులు హఫీజ్ మాత్లూబ్ హుస్సేన్ &సెక్రెటరీ ఆధ్వర్యంలో ర్యాలీని మక్కా మసీదు నుండి ప్రారంభమై గాంధీచౌక్ మీదుగా పాత బస్టాండ్ కృష్ణవేణి చౌక్ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగి తిరిగి వైఎస్ ఆర్ చౌక్ వరకు కొనసాగింది. మీ ర్యాలీలో మతగురువులో యువకులు, విద్యార్థులు కలిసికట్టుగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ వివిధ కులమతాలకు అతీతంగా అందరు ఎకమై, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న
నాయకుల త్యాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సరిత, అలంపూర్
ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబార్, ముస్లిం మత పెద్దలు సంఘాలు నాయకులు పార్టీ కార్యకర్తలు కుల మతాలు అతీతంగా వివిధ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం
చేశారు.