ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు

553nidqbన్యూఢిల్లీ, జులై 27: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఈ కేసు నుంచి జయలలితతో పాటు మరో ముగ్గురిని విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు వెల్లడించిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, ఇదే కేసులో జయ విడుదలను సవాల్ చేస్తున్న డిఎంకే నేత కె అన్బళగన్, బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామికి కూడా నోటీసులు పంపింది.