ఇంటర్ నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన గణేష్

ధర్మపురి : ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ధర్మపురికి చెందిన మామిడిపెల్లి గణేష్ అండర్ 19 కియేటివిటి ఫామ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కిక్ బాక్సింగ్ కోచ్ కస్తూరి ప్రవీణ్ తెలిపారు. నవంబర్ లో న్యూఢిల్లీలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు గణేష్ ఎంపికైనట్లు తెలిపారు.గణేష్ ను రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తోపాటు అభినందించారు.