ఇద్దరు గుంటూరు జిల్లా వాసులు మృతి

ఉత్తరాఖండ్‌ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన తిప్పావజ్జుల మల్లేశ్వరి, కొండరాజు కృష్ణకుమారి మృతిచెందారు. గౌరీకుంద్‌లో ఇంకా నలుగురు గుంటూరు జిల్లా వాసుల ఆచూకీ లభ్యంకా లేదు. మున్నంగికి చెందిన తమ్మా కోటిరెడ్డి, మహాలక్ష్మి, బొమ్మిశెట్టి సత్యనారాయణ, డైవర్‌ వెంకటేశ్వర్లు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు.