ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్(జ‌నం సాక్షి ): భారత బలగాలు భారీ విజయం నమోదు చేసుకున్నాయి. కుల్గాంలోని చద్దర్ ఏరియాలో ఆదివారంనాడు చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వీరిలో లష్కరే అగ్రనేత ఒకరు ఉన్నారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వైద్ ఒకరు ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కుల్గాం ఏరియాలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. రాష్ట్రంలో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చాక ‘ఆపరేషన్ ఆల్ ఔట్’లో భాగంగా భద్రతా బలగాలు పెద్దఎత్తున ఉగ్రవాదుల ఏరివేత చర్యలు  చేపట్టాయి.