ఇన్ఫోసిస్‌ సవాళ్లు ఎదుర్కొంటోంది: నారాయణమూర్తి

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ సవాళ్లు ఎదుర్కొంటోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమితులైన నారాయణమూర్తి అన్నారు. కంపెనీ అభివృద్ధికి తన సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. 2011లో ఇన్ఫోసిస్‌ బోర్డు నుంచి తప్పుకున్న తనకు మళ్లీ పిలుపు రావడం అనూహ్యమని అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి కంపెనీకి వ్యూహాత్మక మార్గం చూపగలరని ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ కామత్‌ అశాభావం వ్యక్తం చేశారు.