ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇద్దరి కాల్చివేత

ముంబయి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పుర్సల్‌గొండి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నక్సల్స్‌ కాల్చిచంపారు. వారిద్దరూ పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే కారణంతో నక్సల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పుర్సల్‌గొండికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.