ఇరాన్‌లో భారత జాలర్ల అరెస్టు

టెహ్రాన్‌ : అనుమతి లేకుండా ఇరాన్‌ తీరంలోకి ప్రవేశించిన 12 మంది భారత జాలర్లను అబు మస్‌ నేవీ, పర్షియన్‌ గల్ఫ్‌ బృందాలు అరెస్టు చేశాయి. ఈ మేరకు ఇరాన్‌ మిలిటరీ అధికారులు మీడియాకు వెల్లడించారు. రెండు నౌకల్లో వారు యూఏఈ మీదుగా ఇరాన్‌లోకి ప్రవేశించినట్లు ఇరాన్‌ వార్తా ఛానల్‌ ప్రసారం చేసింది.