ఇరుముడితో స్వాములు

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (27) జనంసాక్షి న్యూస్
ఘనంగా శ్రీ వీరభద్ర నక్షత్ర దీక్ష మాల విరమణ
 తెలంగాణలో ప్రసిద్ధి చెందిన భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో గత కొద్ది సంవత్సరాలుగా శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష మాలలు వేస్తున్నారు అందులో భాగంగా 27 రోజులుగా మాలలు వేసిన స్వాములు ఇరుముడితో మాల వీరుమణ చేశారు  శనివారం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం నందు  శ్రావణమాసం చివరి రోజు సందర్భంగా గురుస్వామి మొగిలిపాలెం రాంబాబు అధ్వరంలో శ్రీ వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష మాల విరమణ కార్యక్రమం నిర్వహించారు దీక్ష స్వాములు ఇరుముడి ధరించి కొండపై స్వయబు శివాలయాన్ని దర్శించి అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు పాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం మాల వీరమణ స్వాములకు హాజరైన భక్తులకు కొందరు కొందరు భక్తుల ఆర్థిక సాయంతో దేవాలయ కార్య నిర్వహణ అధికారి మారుతి కుటుంబ సభ్యులకు సతీసమేతంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి ,చైర్మన్ ,మారిసెట్టి కుమారస్వామి మాజీ కార్య నిర్వహణ అధికారి, నిమ్మ ,సుదర్శన్ రెడ్డి ముఖ్య అర్చకులు  రాజయ్య అర్చకులు ,తాటికొండ వీరభద్రయ్య ,నందనం సదానందం దేవాలయ అర్చకులు దీక్ష గురు స్వామి మొగిలిపాలెం రాంబాబు శ్రీకాంత్ ,శరత్ ,చంద్ర శివకుమార్, రమేష్ లు సిబ్బంది రామకృష్ణారావు సంజీవరావు మల్లారెడ్డి సందీప్, రాజేందర్ లు, దేవస్థానం మాజీ ధర్మకర్తలు గ్రామ ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు