ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు

ప్యారిస్‌(ఫ్రాన్స్‌) : ప్రపంచ ప్రసిద్ధ కట్టడమైన ఈఫిల్‌ టవర్‌ను బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అక్కడ వున్న దాదాపు 1400 మంది పర్యాటకులను టవర్‌నుంచి తరలించారు. అనంతరం పోలీసు జాగిలాలతో పాటు బాంబు నిర్వీర్య దళాలు టవర్‌ను నిశితంగా శోధించారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్ధాలులేవని వారు నిర్ధారించారు. మాలిలో ఫ్రాన్స్‌ చేపట్టిన సైనిక చర్య అనంతరం దేశంలో అల్‌ఖైదా ఉగ్రవాదుల చొరబాటుపై నిఘాను పెంచిన సందర్భంలోనే బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడం గమనార్హం.