ఈవీఎం పై అనుమానం ఉంది : కాంగ్రెస్ నేత మోహన్ ప్రకాశ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పని తీరుపై మరోసారి అనుమానాలు, అపోహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల విషయంలో తొలి నుంచి తాను అనుమానాలు వ్యక్త పరుస్తున్నాని కాంగ్రెస్ నేత మోహన్ ప్రకాశ్ అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలపై పనితీరుపై ప్రశ్నించకపోవడం బాధకరమని ఆయన తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై గతంలో బీజేపీ కూడా ఆరోపణలు చేసిందన్నారు. అలాంటప్పుడు ఎన్నికల పోలింగ్ను బ్యాలెట్ ద్వారా నిర్వహించడం వల్ల బీజేపీకి వచ్చిన ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు.