ఈ నెల 13న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలి.

15న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి.
బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ దిలీప్ ఆచారి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 11(జనంసాక్షి):
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఈనెల 13 నుండి 15 వరకు దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ దిలీప్ ఆచారి తెలిపారు గురువారంనాడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఇందుకుగాను గ్రామాలలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు.14న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. 15న 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సమీపం నుండి హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించి సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ఉత్సాహ పూరిత వాతావరణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేధావులు యువకులు ప్రజా సంఘాలు స్వాతంత్ర సమరయోధులు వ్యాపార వాణిజ్య వేత్తలు కార్మికులు కర్షకులు పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్లమెంటు కన్వీనర్ సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రాము జిల్లా అధికార ప్రతినిధి శ్రీశైలం నాయకులు లక్ష్మయ్య చందు సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు