ఈ నెల 28 న జి హెచ్ ఏం సి ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

-మేయర్  గద్వాల్ విజయ లక్ష్మి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 26 జనంసాక్షి:
బతుకమ్మ సంబరాలు  పురస్కరించుకొని   జిహెచ్ఏంసి  ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులచే ఈ నెల 28వ తేదీన సాయత్రం 4.30  గంటలకు  బతుకమ్మ  పండుగ  వేడుకలు ప్రధాన కార్యాలయం లో  నిర్వహిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు.
బతుకమ్మ పండుగ వేడుకలలో మహిళ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం   చేయాలని అన్నారు.  ప్రతి హెచ్ఓడి లు భాధ్యత తీసుకొని మహిళ ఉద్యోగులు పాల్గొనే విధంగా  చర్యలు తీసుకోవాలని  మేయర్ అన్నారు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి  అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు  పాల్గొంటారు.