ఉగ్రవాదాన్ని సంఘటితంగా ఎదుర్కొంటాం: ప్రధాని

శ్రీనగర్‌ : ఉగ్రవాద చర్యలను భారత్‌ సంఘటితంగా ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూకాశ్మీర్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. లేహ్‌లో ఏడాది పొడవునా విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటామని ప్రధాని వెల్లడించారు.