ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన వాకర్స్ గ్రూప్

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 18 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన ఉద్యోగులను, ఉపాధ్యాయులను గద్వాల పట్టణంలోని వాకర్స్ గ్రూప్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వెనుక గల మైదానంలో ఆదివారం వాకర్స్ గ్రూప్ సభ్యులు భీమయ్య రాధాకృష్ణారెడ్డి,గోపాల్ రజక, పరశురాముడు,చెన్నకేశవులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధి సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.