ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ధరూర్ తహసీల్దారు..

 

గద్వాల రూరల్ ఆగష్టు 15 (జనంసాక్షి):-వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గతంలో కొత్తకోట మండలంలో తహసీల్దారుగా ఎం.వేంకటేశ్వర్లు పని చేసిన సమయంలో తేదీ 08/09/2021 రోజు కొత్తకోట తహసీల్దారు కార్యాలయంలో జరిగిన రెడ్ క్రాస్ రక్తదాన కార్యక్రమంలో కరోన మహమ్మారి సమయంలో 111 యూనిట్ల రక్త దాతలచే ఇప్పించినందుకు గాను గవర్నర్,ప్రెసిడెంట్ ఇండియ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ స్టేట్ బ్రాంచ్ నుండి వచ్చిన ప్రశంసా పత్రమును తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సిగిరెడ్డి నిరంజన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ యస్మిన్ బేగం ల చేతులమీదుగా వేడుకలలో అందజేశారు…