ఉత్తరాఖండ్‌లో 17కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి చార్‌ధామ్‌ యాత్రికులు, నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 41 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. గత నాలుగు రోజులుగా ఉత్తరాకాశీ వద్ద ఆంధ్రప్రదేశ్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.