ఉత్తరాఖండ్‌ మృతులు 560: విపత్తు నిర్వహణశాఖ

ఉత్తరాఖండ్‌: వరద నష్టం వివరాలను డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మృతిచెందగా, 344 మంది గల్లంతయ్యారు. 436 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 99వేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇంకా పలుచోట్ల 4వేల మంది చిక్కుకున్నారని విపత్తు నిర్వహణశాఖ  వెల్లడించింది. వరదల వల్ల 154 వంతెనలు, 2,232 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1520కి పైగా రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.