ఉపాధ్యాయురాలి ఔదార్యం…

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్  ) ;- నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయురాలు మహేశ్వరి తన ఔదార్యాన్ని చాటారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మండల టాపర్ అపూర్వ, అంకితతో పాటు మరికొందరి విద్యార్థులకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, జిహెచ్ఎం చంద్రశేఖర్,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.