ఉరి తీసినా సిద్ధమే
దొడ్డబళ్లాపురం: తన హయాంలో అవినీతి జరిగిందని నిరూపించి ఉరి తీసినా తాను సిద్ధమేనని రాష్ర్ట ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అన్నారు. దేవెగౌడ, ఆయన కుమారులకు తన పేరు తలవందే నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. స్థానిక అనిబిసెంట్ పార్కలో నిర్వహిస్తున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స జంబోరేట్ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ర్టంలో విద్యుత్ కొరత ఉందని, ఎంత కష్టపమైనా వినియోగదారులపై ధరల భారంమో పకుండా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. రూ. 7కు తక్కువగా ఎవరూ బిడ్ చేయడం లేదన్నారు. దీంతో విద్యుత్ ఉత్పాదనకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పాదనకు కొత్త పాలసీలు రూపొందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
దేవెగౌడ ఆయన కుమారులకు పత్రికల వాళ్లు కనిపిస్తే అర్థం లేని స్టేట్మెంట్లు ఇస్తూ పేపర్ పులులుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ మి చేయలేని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రే వణ్ణ ప్రస్తుతం మతి స్థిమితం కోల్పోయి మా ట్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ర్టంలో సిద్ధరామయ్య నేతృత్వంలో ఉత్తమ పాలన అందుతోందని కితాబునిచ్చారు. దీనిని స హించలేక కొందరు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు