ఎంపీ పదవులకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా

బెంగళూరు, మే19(జ‌నం సాక్షి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు బీఎస్‌ యడ్యూరప్ప, బి. శ్రీరాములు తమ ఎంపీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.  ఉదయం 11గంటలకు కర్ణాటక విధానసభలో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ప్రస్తుతం షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీరాములు ప్రస్తుతం బళ్లారి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ఈ ఇద్దరితో… శనివారం ప్రొటెం స్పీకర్‌ బో పయ్య శాసన సభ్యులుగా ప్రమాణం చేయించారు.