ఎడ్ల బండి పై బిజేపీ అభ్యర్థి బోగ శ్రావణి వినూత్న ప్రచారం

రాయికల్,నవంబర్15
(జనంసాక్షి)రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలో మంగళవారం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి ఎడ్ల బండి పై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బిజెపి పార్టీ తరఫున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అందరూ ఆదరించాలని ప్రజలను కోరారు. వీరి వెంట బిజేపీ నాయకులు,కార్యకర్తలు,
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.