ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.