ఎన్నికలను బహిష్కరించిన ముషారఫ్‌ పార్టీ

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఈనెల 11న జరగునున్న సాధారణ ఎన్నికలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అధ్వర్యంలోని అల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ బహిష్కరించాలని నిర్ణయించింది. ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన 170 మంది పోటీనుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న ముషారఫ్‌ ఎన్నికల్లో పోటీచేయడంపై న్యాయస్థానం జీవితకాల నిషేధం విధించడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.