ఎన్‌టీఆర్‌ నగర్‌వాసుల మౌనదీక్ష

సరూర్‌నగర్‌ పట్టణం: దిల్‌షుక్‌నగర్‌లో వరస బాంబు పేలుళ్లను నిరసిస్తూ ఎన్‌టీఆర్‌ నగర్‌ వాసులు మౌనదీక్షను చేపట్టారు. నోటికి నల్లగుడ్డ ట్టుకుని రెండు గంటలపాటు మౌనదీక్ష చేపట్టారు. పేలుళ్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, విశ్వ హిందూ పరిషత్తు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.