ఎపి భవన్‌ వద్ద నిరుద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారని ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఉద్యోగలు గురువారం ఆందోళన బాట పట్టారు. రిటైర్‌ అయిన వారకే మళ్లీ ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఏపీ భవన్‌ ఉద్యోగుల సంక్షేమసంఘం ఆందోళ వ్యక్తం చేసింది. ఏపీ భవన్‌లో ఉన్న ఉద్యోగాలు అన్నీ తెలుగువారితోనే భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు సైతం తెలుగువారికే ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. జాయింట్‌ కవిూషనర్‌, అసిస్టెంట్‌ కవిూషనర్‌ పోస్టుల కోసం సరెండర్‌ చేసిన 12 పోస్టులను తిరగి ఇవ్వాలని ఏపీ భవన్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది.