ఎమ్మెల్యే క్యాంపు ఆఫిసులో ఆర్ డి ఎస్  అధికారులతో సమీక్ష సమావేశం* 

*ఎమ్మెల్యే క్యాంపు ఆఫిసులో ఆర్ డి ఎస్  అధికారులతో సమీక్ష సమావేశం* 
గద్వాల నడిగడ్డ, జూన్ 3 (జనం సాక్షి);
 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ డి ఎస్ పై అధికారులతో 13  కోట్ల రుపాయలతో జరుగుతున్న జంగిల్ కటింగ్, షిల్డ్ పై అధికారులతో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరగా ఈ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు.త్వరలో   జరుగుతున్న పనులను పరిశీలించడానికి  వస్తాను అని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో  ఇరిగేషన్ డివిజన్ 4 ఆర్ డి ఎస్  ఇఇ విజయ్ కుమార్ రెడ్డి, డి ఇ లు శ్రీనివాస్‌, జయప్రకాష్, ఏ ఇ లు, ఆర్ డి ఎస్ మాజీ చైర్మన్ సీతారామి రెడ్డి పాల్గొన్నారు.