ఎమ్మెల్యే మాణిక్యరావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఝరాసంగం ఆగస్టు 16( జనంసాక్షి) స్థానిక శాసన సభ్యులు మాణిక్యరావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెరాస మండల పార్టీ అధ్యక్షులు రాచయ్య స్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం లో సిఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా రాచయ్య స్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం సహాయ నిధి నుంచి, ఝరాసంగం మండలం లోని వనం పల్లి, మేదపల్లి, కమాల్ పల్లి,ఏడాకుల పల్లి, గుంత మర్పల్లి ఏల్గోయి జీర్ల పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానిక శాసన సభ్యులు మాణిక్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేశారన్నారు. మండలంలోని 18 మందికి 5 లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఝరా సంగం సర్పంచ్ పోరామ్ అద్యక్షుడు జగదీశ్వర్,.మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ రైతు సమన్వయ అద్యక్షుడు సుభాష్ రావు ఎల్గోయి సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ మాజీ సర్పంచ్ ప్రభు పాటిల్,, జిర్ల పల్లి వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు