ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌


హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం
నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు
న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అవిూర్‌ అలీఖాన్‌ లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని రాష్ట్ర కేబినెట్‌ గవర్నర్‌ కు సిఫార్స్‌ చేసింది. ఐతే కొత్త నియామకాలపై స్టే విధించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీం స్టే ఇచ్చింది. మరోవైపు కొత్త నియామకాలను చేపట్టకుండా ఆపాలన్న పిటిషనర్లు కోరికను సుప్రీం తిరస్కరించింది. గవర్నర్‌, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిండంతో కొత్త వారికి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ భారాస నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.