ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..

భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.అభివృద్ధిని బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నాం. ‘నేషన్‌ ఫస్ట్‌.. రాష్ట్ర్‌ హిత్‌ సుప్రీం’ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశాం. మన బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైంది. జల్‌ జీవన్‌ మిషన్‌తో 15 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు రూ.9లక్షల కోట్ల రుణాలిచ్చాం. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తాం” అని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌ చిరుధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాలి. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించాం. యువతకు నూతన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తాం. భారత్‌ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది.