ఎర్రన్నాయుడు మృతికి వాషింగ్టన్‌లో ఎన్నారైల సంతాపం

ఎర్రన్నాయుడు మృతికి వాషింగ్టన్‌లో ఎన్నారైల సంతాపం

గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు మృతికి అమెరికాలోని ఎన్నారైలు శ్రద్ధాంజలి ఘటించారు. వాషింగ్టన్‌లోని డీసీలోని మయూరి ఇండియా రెస్టారెంట్‌లో ఆదివారం సంతాపసభ నిర్వహించారు. టీడీపీ ఎన్నారై విభాగం కన్వీనర్‌ సతీష్‌ వేమన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని తెలుగువారు పెద్దఎత్తున హాజరయ్యారు. విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న ఎన్నారైల సమస్యలను ఎర్రన్నాయుడు ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తెచ్చి పరిష్కరించినట్లు వారు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కొల్లా సుబ్బారావు, చెన్నుపాటి రాంకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.