ఎర్రవల్లిని మండలం చేయాలని బి. వీరాపురం గ్రామస్తులు నిరాహార దీక్ష

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 6 :
14 గ్రామ పంచాయతీలను కలుపుకొని ఎర్రవల్లిని మండలం చేయాలని బి. వీరాపురం గ్రామ సర్పంచ్ రాముడు ఆధ్వర్యంలో గ్రామస్తుల చేత రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. శనివారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని మండల సాధన సమితి కమిటీ అధ్యక్షులు పి. రాగన్న, సర్పంచ్ జోగుల రవి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు 9వ రోజు బి. వీరాపురం గ్రామ సర్పంచ్ రాముడు, తిమ్మారెడ్డి, ఏ. నాగేష్, బలరాముడు, సహదేవ్ నాయుడు, బీచుపల్లి లు దీక్షకు సంఘీభావంగా దీక్షకు కూర్చున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్రవలిని మండలం ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటన్న, మన్నె నాయుడు, మద్దిలేటి, చిన్న గాలెన్న, పెద్ద స్వామి, రామనాయుడు, మౌనిటీ వెంకటరాముడు, సాకలి రాముడు, రాముడు, కొంకల రాముడు తో పాటు వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.