ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ ఖర్చు తేల్చాలి: కేసీఆర్‌

వరంగల్‌: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ నిధుల ఖర్చు లెక్క తేల్చాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ నిధులపై లెక్కలు తేల్చకుంటే టీఆర్‌ఎస్‌ నిరసనలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు. పాత విషయాలు తేల్చకుండా కొత్త చట్టం తేవడం వల్ల ఉపయోగం ఏముందో ప్రభుత్వానికే తెలియాలి అని వ్యాఖ్యానించారు.