ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వనపర్తి అఖిలపక్ష జిల్లా ఐక్యవేదిక మద్దతు.

వనపర్తి టౌన్ :ఆగస్టు 5 (జనం సాక్షి)
ఎస్సీ వర్గీకరణ బిల్లు ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆమోదముద్రవేయాలని వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు మద్దతు ప్రకటించారు దీక్ష వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్ గంధం నాగరాజు ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ నాయకులు వెంకటస్వామి చెన్నకేశవులు లకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కోకన్వీనర్ చిరంజీవి ఉపాధ్యక్షులు వెంకటేష్ అడ్వకేట్ ఆంజనేయులు సతీష్ తదితరులు మాట్లాడారు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా మరికొన్ని పార్టీలు దీనికి మద్దతు పలికాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టిందని విమర్శించారు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ కు మద్దతు ఉంటుందని పోరాటంలో వారి వెంట నడుస్తామన్నారు