ఏకపక్ష నిర్ణయాలే దేశానికి శాపం

ఆ ఇద్దరి కారణంగా ప్రస్తుత సంక్షోభం

మరోమారు ఎన్నికల్లో విజయమే వారి లక్ష్యం

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి): భారతీయజనతాపార్టీ వ్యవహారాలన్నీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. పార్టీలో ఆయన అన్నీ తానై వ్యవహరి స్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వెంటనే సొంత రాష్ట్రమైన గుజరాత్‌ నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడైన అమిత్‌ షాను ఏరికోరి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తెచ్చుకోగలిగారు. ఇక ఆ తరవాత ఆ ఇద్దరే దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ సొంతబలంతో సర్కారును నడుపుతున్న కారణంగా నాటి ఎన్‌డీఏ ప్రభుత్వం మాదిరిగా సమిష్టి నిర్ణయాలకు తావీయడం లేదు. పేరకు ఎన్‌డిఎ అంటున్నా అంతా మోడీ నిర్ణయాలే సాగుతున్నాయి. ఇప్పుడు వారిద్దరి నిర్ణయాల కారణంగా ఎన్నికలను ముందుకు జరిపి లబ్దిపొందాలన్నఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. దేశ చరిత్రలో 70 ఏళ్లు అంటే తక్కువ సమయమేవిూ కాదని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్‌ పదేపదే చెబుతున్నారు. గుణాత్మక రాజకీయాలు రావాలని అంటున్నారు. అయినా మార్పు రావడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని తాజాగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. బిజెపిలో అంతర్గ ప్రజాస్వామ్యం లోపించడం, పెద్దల ఆలోచనలను తీసుకోవడం లాంటి సంప్రదాయాలకు చెక్‌ పడింది. మిత్రపక్షాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకు సాగే సంప్రదాయాన్ని పక్కన పెట్టారనడానికి ఇటీవలి ఎపి పరిణామాలే నిదర్శనం. ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదు. నాలుగేళ్ల పాలన తరవాత కూడా తాను దేశాన్ని ఏ దిశగా తీసుకెళుతున్న సంగతిని ప్రధాని మోడీ గుర్తించడం లేదు. దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాలను తెలుసు కోవడం లేదు. తాను గొప్పగా ప్రవచిస్తున్న నోట్లరద్దు, జిఎస్టీ విపరిణామాలను గుర్తించడం లేదు. దీంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దేశంలో అరాచక పరిస్థితి నెలకొంది. బ్యాంకుల దోపిడీ, అత్యాచారాలు, హత్యలు విచ్చలవిడిగా సాగుతున్నా ప్రభుత్వం ఉందన్న భయం లేకుండా పోయింది. ప్రభుత్వం పథకాల పేర్లు చెప్పి చాంతాడంత జాబితాను వల్లెవేస్తోందే తప్ప ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించే పనులేవీ జరగడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ దేశాన్ని గాడిలో పెడతామన్న వారు గాడితప్పేలా చేశారు. నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులను ఇక మనో ఐదేళ్లలో చేస్తారన్న గ్యారెంటీ లేదు. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని మోడీ ప్రకటించారు. గత నాలుగేళ్లుగా మోడీ చెబుతున్న ఏ ఒక్కటి కూడా కార్యాచరణకు రావడం లేదు. అవినీతిని అంతమొందించే క్రమంలో చిత్తశుద్దితో సాగితే ప్రజలు అండగా ఉంటారని గుర్తించాలి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తమ బతుకుల్లో మార్పు వస్తుందని భావించారు. కానీ అలాంటి సందర్భాలు రాలేదు. నోట్లు రద్దు చేసినా, జిఎస్టీ వాతలు పెట్టినా భరిస్తున్నారు. ఈ భరింపు ఎంతకాలం అన్నది ప్రధాని మోడీ ఆలోచించు కోవాలి. జీఎస్టీతో కొత్త చరిత్ర సృష్టించామని.. కొత్త పన్ను విధానానికి అందరి మద్దతు లభిస్తోందని చెప్పుకుంటూ ఎంతకాలం ప్రజలను వంచన చేస్తారన్నది చూడాలి. ప్రజలకు కూడా ఓపిక నశిస్తోందని గుర్తించకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుంటే మొదటికిఏ మోసం వస్తుంది. బ్యాంకుల విశ్వసనీయతను దెబ్బతీసిన పాలకులు అవి మళ్లీ గాడిన పడేందుకు ఏం చేస్తారన్నది చూడాలి.