ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టు పిలుపు

విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఏజెన్సీ బంద్‌ మావోయాస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాలకు నడిచే బస్సులను ఏపీఎస్‌ ఆస్టీసీ అధికారులు నిలిపివేస్తోన్నట్టు ప్రకటించారు.