ఏడాదిపాటు హెడ్లీని మాకప్పగించండి: భారత్‌

ఢిల్లీ : ముంబయి పేలుళ్ల కీలక నిందితుడు డేవిడ్‌ హెడ్లీని విచారణ నిమిత్తం ఒక ఏడాది పాటు భారత్‌కు అప్పగించాలని. భారత్‌ అమెరికాను కోరింది. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీల బదిలీ సాధ్యంకాదని అమెరికా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఒక సంవత్సరం పాటు తాత్కాలికంగా అతనిని తమకప్పగించమని భారత్‌ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌ విజ్ఞప్తిని అమెరికా మన్నించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.