ఏపీకి ప్రత్యేకహోదాపై నోరు విప్పండి
బీజేపీ కి దిగ్విజయ్ సూటి ప్రశ్న
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై బీజేపీ మాటమారుస్తోందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ దిగ్విజయ్ సూటి ప్రశ్న వేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనక్కి తగ్గడంపై టీడీపీ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ సీఎంలు ఏపీకి ప్రత్యేకహోదాను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రధానికి అందజేయనున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. ఏప్రిల్లో ఏపీలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలవరాన్ని వ్యతిరేకించడం లేదన్న దిగ్విజయ్ నిర్వాసితులకు ప్యాకేజి పెంచాలని కోరుతున్నామన్నారు.