ఏపీ బీజేపీలో గ్రూపులు లేవు
– ఇందంతా విూడియా సృష్టే
– పార్టీలో కొత్తా, పాత అనేది ఉండదు
– పార్టీ అధిష్టానానికి అందరూ సమానమే
– కన్నా నాయకత్వంలో అందురూ పనిచేస్తారు
– ఈనెల 15 తరువాత 2019 వ్యూహాలను వెల్లడిస్తాం
– కర్ణాటకలో విజయం బీజేపీదే
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు
న్యూఢిల్లీ, మే14(జనం సాక్షి) : ఏపీ బీజేపీలో గ్రూపు తగాలు లేవని, అందరం ఐక్యంగా ఉన్నామని, గ్రూపులన్నది కేవలం విూడియా సృష్టేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని, అందుకు సిద్ధంగానే ఉన్నారని మురళిధర్రావు పేర్కొన్నారు. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు. ఆంధప్రదేశ్ బీజేపీలో రెండు గ్రూపులు లేవని, ఇదంతా విూడియా సృష్టేనని కొట్టిపారేశారు. కులాల ఆధారంగా తమ పార్టీ పదవులు ఇవ్వదని తెలిపారు. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన ఓబీసీ అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు.
కర్ణాటకలో గెలుపు మాదే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందని మురళీధర్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా లేరని తెలిపారు. ఈ నెల 15 తర్వాత 2019 వ్యూహాలను వెల్లడిస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకెళ్లినా, ఆయనకు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.