‘ఏరో ఇండియా -2013’ ప్రారంభం

బెంగళూరు: ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ‘ఏరో ఇండియా -2013’ కార్యక్రమం బెంగళూరులో ప్రారంభమైంది. నగర శివారులోని యలహంక వైమానికి స్థావరంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఏకే అంటోనీ ప్రారంభించారు. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన యుద్ధ విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక సీఎం జగదీశ్‌ షెట్టర్‌, కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌లు పాల్గొన్నారు. ఏరో ఇండియా విన్యాసాలు ఈనెల  10వ తేదీ వరకు జరుగుతాయి.