ఏసీబీ వలలో తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఓ రైతు నుంచి ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ రోజు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.