ఐ ఐ టి లో సి ఎస్ ఇ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి);
ఇటీవలే వెలుబడిన ఐఐటి ఫలితాలలో జె ఇ ఇ ఆల్ ఇండియా 2956 ర్యాంకు పి డబ్ల్యూ డి లో ఆల్ ఇండియా 3 ర్యాంకు సాధించిన బి. జగన్నాథం రెడ్డి కుమారుడు బి.అభినవ్ కుమార్ రెడ్డి కు ఐఐటీలో ముంబై నందు అడ్మిషన్ పొందిన శుభ సందర్భంగా శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అభినవ్ రెడ్డి కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో చదువుకొని అత్యధిక స్థాయిలో ప్రభుత్వం ఉద్యోగం సాధించి మీ తల్లిదండ్రులకు, మీ గురువులు , గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్,జెడ్ పి టి సి రాజశేఖర్,ఎస్ జి టి జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.