ఒబామాకి ఇంత రక్షణ అవసరమా?

న్యూఢిల్లీ : అయినవారికి ఆకులు…కానివారికి కంచాలు అన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. అసలు విషయానికి వస్తే  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు భారతదేశానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు భద్రత ప్రమాణాలు మరింత పెంచారు. ఆగమేఘాల మీద రాజధాని నగరంలో ఏకంగా 15 వేల అదనపు సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సీసీ టీవీలతో పాటు అవసరమైతే ఇంకా భద్రతను పెంచేందుకు కూడా పోలీసు వ్యవస్థ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.